తెలుగు బుల్లితెరపై తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ యాంకర్ రష్మీ.ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై పరిచయమైంది.తన అందంతో మాత్రం అందర్నీ బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం బుల్లితెర పై మాత్రం స్టార్ యాంకర్ ల లిస్టు లో ఉందని చెప్పవచ్చు.కొన్ని ఏళ్ల కిందట ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మీ.పలు సినిమాలలో అందుకొని క్రేజ్ ను కేవలం జబర్దస్త్ ద్వారానే సంపాదించుకుంది.
ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక జబర్దస్త్ తర్వాత కూడా సినిమాలలో నటించిన అంత క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది.
జబర్దస్త్ లో రష్మీ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం కమెడియన్ సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి.
ఎందుకంటే అతడితో బాగా సన్నిహితంగా ఉంటూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
నిజానికి మల్లెమాల కూడా వీరి సన్నిహితంను బాగా క్యాష్ చేసుకుంది.నిజానికి వీరిద్దరు వేదికపై చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
అందరి ముందు వీరిద్దరరు రొమాన్స్ లతో బాగా రచ్చ చేశారు.ఇక వీరిని చూసి ఎంతో మంది ప్రేక్షకులు మొదట్లో షాక్ అయ్యారు.
అలా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా పుకార్లు వినిపించాయి.కానీ తమ మధ్య ఏమీ లేదు అంటూ చాలాసార్లు బయటపెట్టారు.
అంతేకాకుండా జబర్దస్త్ లో చేసే మరికొంత మంది ఆర్టిస్టులు కూడా వీరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు అంటూ స్పష్టం చేశారు.అయినా కూడా వీరు మాత్రం షో లో రియల్ కపుల్స్ లాగా రెచ్చిపోతుంటారు.
అలా మళ్లీ ఎన్నో అనుమానాలు ఎదురవడంతో కేవలం షో కోసం మాత్రమే అలా చేస్తున్నామని.దానివల్ల తమ షోకు మరింత ఆదరణ లభిస్తుందని గతంలోనే తెలిపారు.కేవలం ఈ షో లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న మరో ఢీ డాన్స్ షో లో కూడా వీరిద్దరు టీం లీడర్స్ గా పని చేసిన సమయంలో కూడా తమ రొమాన్స్ లతో బాగా రెచ్చిపోయారు.కానీ ఇప్పుడు సుధీర్ తన లైఫ్ లో బిజీగా గడుపుతున్నాడు.
రష్మీ మాత్రం జబర్దస్త్ లోని బిజీగా ఉంది.అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా చేస్తుంది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
చాలావరకు మూగజీవులకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలు కూడా వదిలి అందరికీ షాక్ ఇస్తుంది.అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తను బాగా షో చేసినట్లు కనిపించింది.అయితే ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు లైక్స్ కొట్టగా కొందరు మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఓ నెటిజన్ మాత్రం ఏకంగా ఏం రాత్రికి సచ్చిపోతావా అంటూ ప్రశ్నించి కొత్త సంవత్సరం రోజే పెద్ద షాక్ ఇచ్చాడు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.