మొదటి సినిమా తో అక్కినేని వారసుడిని అందలానికి ఎక్కించాలి అని చూసిన నాగార్జున కలలు కూల్చేసాడు డైరెక్టర్ వినాయక్.పరమ చెత్తగా అఖిల్ సినిమాని తీసి నాగార్జున ఫాన్స్ తల దించుకునేలా చేసాడు ఆయన.
నాగార్జున కెరీర్ బాగున్నా మరొక పక్క తన కొడుకు ని స్టార్ హీరోని చెయ్యలేకపోతున్నాను అనే ఫీలింగ్ నాగ్ లో అలాగే ఉండిపోయింది.దాన్ని తొలగించడం కోసం అన్నట్టుగా ఇప్పుడు ఊపిరితో నాగ్ కి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వంశీ పైడిపల్లి రంగంలోకి దిగాడు.
ఊపిరి తో జనాలని నవ్వించడం తో పాటు ఏడిపించడం కూడా చేసిన వంశీ అఖిల్ సెకండ్ సినిమాకి దాదాపు గా ఖరారు అయినట్టు తెలుస్తోంది.మొన్నటి వరకూ ఏ జవానీ హాయ్ దివానీ సినిమా ని తెలుగు లో రీమేక్ చెయ్యమంటే తనకి రీమేక్ డైరెక్టర్ అనే పేరు ఒచ్చేలా ఉంది కాబట్టి నో చెప్పిన వంశీ మళ్ళీ మనసు మార్చుకుని నాగార్జున కోసం ఓకే చెప్పాడు అని అంటున్నారు.
నాగార్జున తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో వంశీ పైడిపల్లి అఖిల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది.త్వరలో ఈ సినిమా సంబంధించి అన్ని వివరాలు తెలుస్తాయి.
ఉగాది రోజున ఈ సినిమా వివరాలు తెలిపే అవకాశం ఉండడం తో అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.