కెసిఆర్ కి వార్నింగ్ !

టీ అసంబ్లీ లో కెసిఆర్ కి ధీటుగా కాస్తో కూస్తో మాట్లాడగలరు అంటే అది జానా రెడ్డి మాత్రమే అని చెప్పాలి.తెలంగాణా అధికార పక్షం మీద ఈ నేత ఎప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు.

 Warning To Kcr!-TeluguStop.com

అధికారం శాశ్వతం కాదు అనీ భవిష్యత్ దిశగా సరైన అడుగులు వెయ్యాలి అని కెసిఆర్ పార్టీకే కాక ప్రభుత్వానికి కూడా గట్టిగా సలాహా ఇవ్వగలిగింది జానా రెడ్డి మాట్లాడ్డమే.తనకి అసలు తిరుగులేదు అన్నట్టు ఉండే కెసిఆర్ మీద జానా రెడ్డి తీవ్రమైన మాటల యుద్ధం లో ఎప్పుడూ ముందు ఉంటారు

కెసిఆర్ తరచూ వాడే మాటలు ప్రస్తావిస్తూ దానికి సంబంధించి విమర్శలు చెయ్యడం ఆయనకు అలవాటు.

కొందరు టీఆర్ ఎస్ నేతలు.మంత్రులు రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు తప్పించి మరో పార్టీకి స్థానం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం.ప్రతిపక్షం రెండూ ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు జానా వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇంకో పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని అధికారంలోకి వచ్చారా? అంటూ సూటిగా ప్రశ్నించిన జానా.రాజకీయాల్లో కాలం పాత్రను సమయోచితంగా ప్రస్తావించారు.

‘‘ఏ పార్టీ రాష్ట్రంలో ఉండొద్దు.ఓట్లు అడగటానికి వీల్లేదు అనటం ప్రజాస్వామ్య పద్ధతా? నియంతృత్వ పోకడలకు నిదర్శనం కాదా? అయినా.సంయమనం పాటిస్తున్నాం.సర్ది చెప్పుకుంటున్నాం.పక్క అసెంబ్లీ (ఏపీ) చూసి.అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నా పార్టీ.

నేను చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాం.అధికారం ఎప్పుడూ ఒకరి దగ్గరే శాశ్వతంగా ఉండదు’’ అంటూ జానా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube