మెగా హీరో వరుణ్ తేజ్తో ‘కంచె’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ను అందుకున్న దర్శకుడు క్రిష్ తన తర్వాత సినిమాను కూడా వరుణ్ తేజ్తో తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ను రెడీ చేశాడు.కథ కూడా సిద్దం అయిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో పక్కకు పెట్టారు.
‘రాయభారం’ చిత్రం పట్టాలెక్కక పోవడంతో హీరో వరుణ్ తేజ్ తన తర్వాత సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయ్యాడు.మరో వైపు దర్శకుడు క్రిష్ కూడా తన తర్వాత సినిమాకు సిద్దం అవుతున్నాడు.
క్రిష్ తన తర్వాత సినిమాను బాలీవుడ్లో చేయాలనే ప్లాన్స్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.బాలీవుడ్లో ఇప్పటికే ‘ఠాగూర్’ చిత్రానికి రీమేక్గా ‘గబ్బర్’ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ను దక్కించుకున్నాడు.
బాలీవుడ్లో కమర్షియల్ హిట్ను దక్కించుకున్న క్రిష్కు అక్కడ పలు ఆఫర్లు తలుపు తడుతున్నాయి.ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.
ఆ హీరో ఇప్పటికే క్రిష్తో సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.మరో రెండు నెలల్లో ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి ‘రాయభారం’ కుదరక పోవడంతో వరుణ్ ‘ఫీల్ మై లవ్’ అంటున్నాడు, క్రిష్ బాలీవుడ్కు చెక్కేశాడు.