‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి.ఇటీవలే ఈయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డును కూడా ఇచ్చిన విషయం తెల్సిందే.
అంతటి గొప్ప వ్యక్తిపై కేసు నమోదు అవ్వడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.అవును, రాజమౌళిపై కేరళలో కేసు నమోదు అయ్యింది.
మూగ జీవాలను హింసించినట్లుగా రుజువు అవ్వడంతో కేసును నమోదు చేసినట్లుగా కేరళ పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణను కేరళలో జరిపిన విషయం తెల్సిందే.
ఆ సమయంలో అటవి శాఖ, జంతు సంరక్షణ శాఖ అనుమతిని తీసుకోకుండా ఒక ఏనుగును షూటింగ్ కోసం వినియోగించారట.దాంతో చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు రాజమౌళిపై కేసును పెట్టినట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే రాజమౌళితో పాటు నిర్మాతలకు కేసు బుక్ చేసినట్లుగా సమాచారం ఇవ్వనున్నట్లుగా కేరళ పోలీసులు చెబుతున్నారు.నిర్మాతలు మరియు దర్శకుడు తప్పని సరిగా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని కేరళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోందట.
ఈ విషయంపై బాహుబలి టీం ఇప్పటి వరకు స్పందించినది లేదు.