మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఆ’.నితిన్ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా అనిరుథ్ను ఎంపిక చేయడం జరిగింది.
అయితే తమిళ సినిమాలతో అనిరుథ్ చాలా బిజీగా ఉండి ఈ సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నాడు.దాంతో అతడితో కుదరదని నిర్ణయించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం మిక్కీ జే మేయర్ ‘అఆ’ పనిలోనే బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈసినిమాకు సంగీతం అందించే అవకాశం మహేష్ వల్లే మిక్కీ జే మేయర్కు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మిక్కీ జే మేయర్ ‘బ్రహ్మోత్సవం’కు పాటలు చేస్తున్నాడు.అంతకు ముందు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు కూడా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.అందుకే మహేష్బాబుకు ఈ సంగీత దర్శకుడి పని తీరు బాగా నచ్చింది.దాంతో తన సన్నిహితుడు అయిన త్రివిక్రమ్కు మిక్కీ పేరు సూచించినట్లుగా తెలుస్తోంది.
మహేష్ రికమండేషన్ చేయడంతో పాటు, మిక్కీ జే మేయర్ తన సినిమాకు పనికి వస్తాడనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.‘అఆ’ చిత్రాన్ని మొదట వచ్చే నెల 14న విడుదల చేయాలని భావించారు.
కాని పాటలు పూర్తి అవ్వక పోవడంతో పాటు షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉండటంతో మార్చి లేదా ఏప్రిల్కు సినిమా విడుదల వాయిదా వేశారు.