ఏళ్లుగా హిట్ లేని కళ్యాణ్ రామ్ భారి విజయాన్ని సాధించాడు.టైం అస్సలు బాగాలేని ఎన్టీఆర్ మోస్తారు విజయాన్ని దక్కించుకున్నాడు.
ఇక రెండు వరుస డిజాస్టర్లతో అభిమానుల్ని నిరాశపరిచిన మహేష్ బాబు రికార్డులన్నీ జేబులో వేసుకొని తిరిగాడు.మరి మెగా ఫ్యామిలి మాత్రం నిండా మునిగారు.
పవన్ నుంచి వరుణ్ దాకా అంతా ఫ్లాపులే ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గోపాల గోపాల 6 కోట్ల నష్టాల్ని మీదేసుకోగా, సన్నాఫ్ సత్యమూర్తి తక్కువలో తక్కువ మూడు కోట్ల దాకా నష్టపోయింది.
బ్రూస్ లీ ఏకంగా రికార్డు స్థాయి డిజాస్టర్ గా నిలిచింది.సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తో సాయి ధరమ్ తేజ్ మరో అపజయాన్ని చవిచుసాడు.
వరుణ్ తేజ్ కంచేతో అందరి మనసులని గెలుచుకున్నా, లాభాలు మాత్రం రాబట్టుకోలేకపోయాడు.చివరి ఆశగా మిగిలిన లోఫర్ వరుణ్ కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ గా నిలువనుంది.
పెట్టిందే 21 కోట్లు అంటే , పది కోట్ల నష్టాలతో పంపిణిదారులకు చుక్కలు చూపిస్తోంది లోఫర్.
వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో మహేష్ రికార్డులకు చెక్ పెడతాడని, రామ్ చరణ్ తని ఒరువన్ రీమేక్ తో కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, విమర్శకుల నోళ్ళు మూయిస్తాడని, అల్లు అర్జున్ సరైనోడుతో భారి విజయాన్ని సాధిస్తాడని, సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ తో సూపర్ హిట్ కొడతాడని, ఇక వరుణ్ తేజ్ క్రిష్ సినిమాతో కెరీర్ లో తోలి హిట్ సాధిస్తాడని ఆశిస్తున్నారు మెగా అభిమానులు.