ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీమయం

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఘన విజయం తరువాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ హవా కొనసాగుతూనే ఉంది.మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు స్థానాలను అంటే యాభై శాతం గులాబీ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకొని సత్తా చాటుకుంది.

 Trs Gains Two More Mlc Seats-TeluguStop.com

నిన్నటివరకు నాలుగు సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న గులాబీ పార్టీ ఈ రోజు రెండు సీట్లను అదేవిధంగా సాధించింది.కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణ రావు, భానుప్రసాద్ రావు గెలిచారు.

ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.కాంగ్రెస్ , టీడీపీ అభ్యర్థులు కూడా వివిధ కారణాలతో రంగం నుంచి తప్పుకోవడం ఆ పార్టీల నాయకులకు ఆవేదన కలిగిస్తోంది.

భారీగా డబ్బు తీసుకొని వీరు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.మిగిలిన ఆరు స్థానాల మీద కూడా ప్రతిపక్షాలకు ఆశలు లేవు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనివ్వకూడదని పట్టుదలగా ఉన్న అధికార పార్టీ ఆ పని విజయవంతంగా చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube