తెలంగాణా లాయర్లలో పెరుగుతున్న అసహనం

ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన దాదాపుగా ముగిసింది.అంటే ఉమ్మడి సంస్థలను విభజించడం చాలావరకు పూర్తి అయింది.

 Telangana Advocates Protest For Separate High Court-TeluguStop.com

కొద్దిగా మిగిలి ఉన్నది కూడా తొందరలోనే పూర్తి అవుతుంది.ప్రధానమైన విభజన ఒకటి మిగిలి ఉంది.

అదే హై కోర్టు.దాని విభజనకు ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు.

హై కోర్టును వెంటనే విభజించాలని తెలంగాణా నాయకులు, లాయర్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణా ఎంపీలు అదేపనిగా అడుగుతున్నారు.

కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.హై కోర్టు విభజన ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో తెలంగాణా లాయర్లు తరచుగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

వారు చాల అసహనంగా ఉన్నారు.హై కోర్టు విభజన జరగక పోవడంతో తెలంగాణా లాయర్లకు ఉద్యోగాలు రావడంలేదని, ప్రమోషన్లు రావడంలేదని ఆగ్రహిస్తున్నారు.

ఈ రోజు హై కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.విభజనలో జాప్యం జరగడానికి ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు కారకులని ఆరోపించారు.

కేంద్రం చొరవ తీసుకొని వెంటనే హై కోర్టును విభజిస్తే తెలంగాణా లాయర్లు ప్రశాంతంగా ఉంటారు.అలా చేయకపోతే తెలంగాణా ఉద్యమ సమయంలో మాదిరిగా విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube