టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’.ఈ సినిమా భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు, కథ ఒక్క పార్ట్లో చెప్పే విధంగా లేక పోవడంతో సినిమాను రెండు పార్ట్లుగా తెరకెక్కించాలని జక్కన్న నిర్ణయించాడు.
అనుకున్నదే తడువుగా సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే ఈ సినిమాను రెండు పార్ట్లుగా తీసేయాలనే నిర్ణయానికి వచ్చి ఆ విధంగానే షూటింగ్ను ప్లాన్ చేశాడు.మొదటి పార్ట్తో పాటు రెండవ పార్ట్ చిత్రీకరణ కూడా దాదాపుగా 80 శాతం పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇది వరకే ప్రకటించారు.
‘బాహుబలి’ మొదటి పార్ట్ వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొదటి పార్ట్ విడుదలలో స్పష్టత రావడంతో ఇక రెండవ పార్ట్పై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యింది.
మొదటగా అనుకున్న దాని ప్రకారం అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ‘బాహుబలి`2’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు, బ్యాలన్స్ షూటింగ్ మరియు ఇతర గ్రాఫిక్స్ వర్క్కు ఇంకా సంవత్సరం పట్టే అవకాశాలున్నాయి.
దాంతో జక్కన్న రెండవ పార్ట్ను వచ్చే సంవత్సరం ఇదే సమయంలో విడుదల చేయాలని నిర్ణయించాడు.అన్ని అనుకూలంగా ఉంటే జులై 10 2016లో ‘బాహుబలి`2’ వస్తుందేమో అని కొందరు అంటున్నారు.