ఎప్పుడూ ఒకటే మాట

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులూ ‘మాట తప్పను…మడమ తిప్పను’ అనేవారు.ఆయన కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ కూడా అదే టైపు.

 Chandrababu Is Cheating People-TeluguStop.com

ఈయన కూడా మాట మార్చరు.ఎప్పుడూ ఒకే మాట చెబుతారు.

ఎప్పుడూ ఒకే మాట ఏం చెబుతారు? ‘చంద్రబాబు నాయుడు చీటర్‌’…చంద్రబాబు మోసగాడు…ఇదే ఆయన చెప్పేది.ఈయన కూడా రాహుల్‌ మాదిరిగా అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేశారు.

అక్కడ మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, తాను అలాంటి వాగ్దానాలు చేయకపోబట్టే అధికారంలోకి రాలేదని అన్నారు.బాబు ఆనాడు మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

జగన్‌ది ఎప్పుడూ ఇదే ఆవేదన.ఆక్రోశం.ఈ మాటలు ఇంకా ఎన్నాళ్లు చెబుతారో తెలియదు.ఇంకో నాలుగేళ్ల వరకూ ఇదే ధోరణి కొనసాగుతుంది.

ఆయన ప్రధాని మోదీని ఏమీ విమర్శించకుండా బాబుపైనే ప్రతాపం చూపిస్తున్నారు.తన మీద కేసుల ఉన్నాయి కాబట్టి మోదీని ఏమీ అనలేకపోతున్నారు.

మామూలు మనుషులకైతే చెప్పిందే చెబితే బోరు కొడుతుంది, కాని రాజకీయ నాయకులకు అలా అనిపించదు.చెప్పిన ‘కతలు’ ఎంత కాలమైనా చెప్పగలరు.

వారి స్టామినా అటువంటిది మరి…!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube