అనుకున్నంత పని అయ్యింది.దర్శకరత్న దాసరి నారాయణ రావుకు బొగ్గు మసి పూర్తిగా అంటింది.
గత కొంత కాలంగా బొగ్గు స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చకు వస్తున్న విషయం తెల్సిందే.ఈ వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి అయిన దాసరి నారాయణ రావుకు కీలక పాత్ర ఉందని సీబీఐ నిర్థారించింది.
దాసరిపై చార్జ్ షీట్ దాఖలు చేసింది.దాసరితో పాటు మరో 14 మందిపై కూడా చార్ట్ షీట్ను దాఖలు చేసినట్లుగా సీబీఐ ప్రకటించింది.
దాసరి ఇక కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని కేంద్ర వర్గాల వారు అంటున్నారు.జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, నవీన్ జిందాల్లతో పాటు దాసరికి కూడా ఈ కేసులో కీలక భాగస్వామ్యం ఉందని సీబీఐ తేల్సింది.
ఈ చార్జ్ షీట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును కూడా చేర్చాల్సి ఉండే.కాని సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో మన్మోహన్ సింగ్ను చేర్చలేదు.
త్వరలోనే దాసరికి చెందిన మరిన్ని ఆస్తులను ఈడీ జప్తు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.మొత్తానికి దాసరికి మెల్లగా ఉచ్చు బిగుస్తోంది.