హిందూ సాంప్రదాయాల్లో పెళ్లి ప్రాముఖ్యత చాలా ఎక్కువ.పెళ్లి అనేది చాలా పవిత్రమైందని హిందువులు భావిస్తూ ఉంటారు.
అయితే పెళ్లిపై కొందరు హీరోయిన్స్ చేస్తున్న కామెంట్స్ ఆగ్రహం తెచ్చేవిగా ఉన్నాయి.ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పెళ్లిని అపహాస్యం చేస్తూ కామెంట్స్ చేశారు.
తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సి కూడా పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.పెళ్లి వృదా అని, పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం మంచిది అంటూ తాప్సి ఉచిత సలహాలు ఇస్తోంది.
పెళ్లి కంటే ప్రస్తుత పరిస్థితుల్లో సహజీవనం మంచిదని చెప్పుకొచ్చింది.పెళ్లి, పిల్లల తర్వాత విడి పోవడం కంటే, సహజీవనం చేసి, ఇష్టం లేకుంటే విడి పోవడం ఇబ్బంది లేని విధానం అంటూ తాప్సి కొత్త పద్దతిని చెబుతోంది.
అయితే తాప్సి వ్యాఖ్యలపై కొందరు హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి ఒక పవిత్రమైందని దాన్ని అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదు అంటూ తాప్సికి హెచ్చరికలు జారీ చేశారు.
తాజాగా ఈమె ‘కాంచన`2’తో తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది.త్వరలో ‘గంగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా శింబు హీరోగా సెల్వ రాఘవన్ దర్శకవ్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఒక హీరోయిన్గా ఈ అమ్మడు ఎంపిక అయ్యింది.మరోవైపు బాలీవుడ్లో సైతం ఈమె చిన్న చిన్న సినిమాలో నటిస్తూ ఉంది.