నాగార్జున త్వరలో ‘మనం’ అనే తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రసాద్ వి పొట్లూరితో కలిసి నాగార్జున ఈ ఛానెల్ను ఏర్పాటు చేయనున్నట్లుగా సినీ వర్గాల్లో సైతం ప్రచారం జరిగింది.
మా టీవీలో భాగస్వామిగా ఉన్న నాగార్జున ఆ అనుభవంతో ‘మనం’ ఛానెల్ను ఏర్పాటు చేయనున్నట్లుగా అంతా అంటున్నారు.అయితే ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.
‘మనం’ ఛానెల్ విషయంలో నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.తాను ‘మనం’ అనే ఎంటర్టైన్మెంట్ ఛానెల్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి ఒట్టి పుకార్లు మాత్రమే అని తేల్చి చెప్పాడు.
దాంతో ‘మనం’ టీవీ వార్తలకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.నాగార్జున టీవీ స్టార్ చేస్తున్నాడనే వార్తలు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే అవి పుకార్లు అని నాగ్ ఖండిరచడంతో వారు ఉసూరుమంటున్నారు.నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఆ రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.