తెలుగులో మరో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ రాబోతుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఆ ఛానెల్ను తీసుకు వచ్చేది మరెవ్వరో కాదు అక్కినేని హీరో నాగార్జున.
మాటీవీలో కొంత వాటా ఉన్న నాగార్జున త్వరలోనే సొంతంగా ‘మనం’ ఛానెల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది.ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతుల కోసం నాగార్జున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
నాగార్జునతో పాటు ‘మనం’ ఛానెల్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి కూడా భాగస్వామి కానున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగులో ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఉన్నప్పటికి మాటీవీ, జీ తెలుగు, జెమిని టీవీ, ఈటీవీలకు మాత్రమే ప్రాచుర్యం ఉంది.ఇక మిగిలిన చానెల్స్కు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఈ నేపథ్యంలో అక్కినేని వారి ‘మనం’ ఛానెల్కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.‘మనం’ ఛానెల్ తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతుందా లేక, ఇతర ఛానెల్స్లా కొన్ని రోజులు ఇలా వచ్చి అలా వెళ్తుందా అనేది చూడాలి.