పోలీసులకు నిందితులపై ఎప్పుడు చులకన భావమే కలుగుతుంది…చిత్తూరు జిల్లా పోలీసుల పుణ్యమా అంటూ.ఒక నిందితుడు కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.అత్యాచారం కేసులో నిందితుడిగా భావిస్తున్న షేబ్ బాబును అరెస్టు చేసిన పోలీసులు అతడికి నరకం చూపారు.
పది రోజుల పాటు అక్రమంగా నిర్భింధించిన పోలీసులు అతడికి థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందో రుచి చూపించారు.దీంతో అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
దీంతో అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, పోలీసుల థర్డ్ డిగ్రీ కారణంగా నిందితుడి కిడ్నీలు రెండు ఫెయిలయ్యాయని నిర్ధారించారు.ప్రస్తుతం తిరుపతిలోని స్విమ్స్లో అతడు చికిత్స పొందుతున్నాడు.
ఆసుపత్రిలో ఉన్న నిందితుడు తనను పోలీసులు ఏవిధంగా చిత్రహింసలకు గురిచేశారో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో నిందితుడి వాదన నిజమని తేలడంతో సీఐ వేణుగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.దీని పైన పూరీ విచారణ తరువాత దీనికి భాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఎస్.పీ.