కేంద్ర మంత్రి.టీడీపీ నాయకుడు.
ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరికి హైదరాబాద్ తెలంగాణా ప్రభుత్వం సచివాలయంలో చుక్కెదురయింది…విషయం ఏమిటంటే నిన్న ఒక పనిలో భాగంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన సుజనా అక్కడ కేసీఆర్ కోసం వేట్ చేసి.చివరకు ఆయన లేకాపోయేసరికి సీఎస్ రాజీవ్ శర్మతో మాట్లాడి వెనుదిరిగారు.
ఇదిలా ఉంటే అధికారులు నుంచి వస్తున్న వాదన ప్రకారం కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో.ఆయన సచివాలయానికి రాలేదని తెలుస్తుంది.
ఇంతవరకు ఎలా ఉన్నా.కేసీఆర్ సచివాలయానికి రాలేదని అధికారులు ముందే చెప్పాలి కదా అంటూ సుజనా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఇక చేసేది ఏమీ లేక ముఖ్యమంత్రిని మళ్లీ కలుస్తాను అని సుజనా అక్కడనుంచి వెనుతిరిగినట్లు సమాచారం.