అల్లు అర్జున్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీకి టైటిల్ను తాజాగా ఫిక్స్ చేశారు.మొదట ఈ సినిమాకు ‘త్రిశూలం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని తాజా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘హుషారు’ అనే టైటిల్ను ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమా కథ మరియు అల్లు అర్జున్ పాత్ర తీరుకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని దర్శకుడు త్రివిక్రమ్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నాయని అన్నారు.అయితే వచ్చే నెల క్రికెట్ ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో అది పూర్తి అయ్యే వరకు ఆగే అవకాశముందని అంటున్నారు.
ఈలోపుగా ఈ సినిమా కార్యక్రమాలన్ని కూడా పూర్తి చేయనున్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్లుక్ను మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేసే అవకాశాలున్నాయి.
అప్పటి వరకు ఈ సినిమాకు ‘హుషారు’ టైటిల్ కన్ఫర్మ్ చేయనున్నారు.ఈ సినిమాలో సమంతతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నిత్యామీనన్, అదాశర్మలు నటిస్తున్నారు.
‘జులాయి’ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.