మౌనం మాట్లాడుతుంది.చాలాకాలంగా మూగబోయిన గొంతు ఒకటి మరోసారి తన ఊసులు వివరిస్తుంది.
అప్పట్లో జగన్ జైల్ లో ఉన్న సమయంలో మా జగన్ బాబు ముఖ్యమంత్రి ఏంటి సాక్షాత్తూ ప్రధాన మంత్రి అయిపోతారు అని కామెడీ పంచిన వైఎస్ఆర్ నేత అంబటి రాంబాబు పాపం గత ఎన్నికల్లో చావు దెబ్బ తిని మూగబోయారు.అయితే ఇంకా చేసేది ఏమీ లేక తన నియోజకవర్గంలో సైతం తల ఎత్తు కోలేక ఈ మద్య మీడియాలో పెద్దగా స్టిల్స్ ఇవ్వడంలేదు.
ఏమయిందో ఏమో గాని సడన్ గా ఉరుములు లేని వర్షంలాగా… మరో సారి చంద్రబాబు పై తన గళం విప్పారు.మాట్లాడటం తోనే చంద్రబాబు పెద్ద సాడిస్ట్ అని, ఆయన విధానాలు అన్ని వేస్ట్ అని తేల్చేసారు.
అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ అంబటి ఇరగదీసి మాట్లాడేశారు.ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాకుండా సాక్షాత్తూ రైతులే ఈ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.ప్రభుత్వ పనితీరు బేష్ అంటూ లోకేష్ ఓ సర్వే చేయించారని… ఇదే సర్వేని రాజధాని తుళ్లూరులో చేయిస్తే ప్రభుత్వానికి ముప్పు తప్పదు అని ఆయన చంద్రబాబు సర్కార్ పై విరుచుకు పడ్డారు.
తప్పేముంది పాపం జగనన్న అధికారం వస్తే చక్రం తిప్పేయ్య వచ్చు అనుకున్నారు.కానీ ఎదురు దెబ్బ తగలడం తో ఈ మాత్రం చిరాకు సహజం.