వానాకాలం మొదలయ్యి ఒక నెల గడిచిన తరువాత కూడా ఎల్నినో ప్రభావం వలన వానలు కురవక అటు రైతులు ఇటు ప్రభుత్వాలు రెండు ఇబ్బందిపడుతున్నాయి.వానలు కురవకపోవడంతో కరెంటు ఉత్పత్తి తగ్గిపోయి ఉన్నపంటలకు మరియు పరిశ్రమలకు సరఫరా చేయలేక హ్గత రెండునెలలుగా ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
నిన్నటి నుండి మొదలైన వానలు ఈ రోజు రాష్ట్రం అంతట తన ఉనికిని చాటుకొని ప్రజలు మరియు రైతుల మొహాల్లో ఆనందం నింపింది.ఈ రోజు హైదరాబాద్ లోకూడా కొన్ని ప్రదేశాలలో కురిసిన వానతో నగరంలోని రోడ్లు నీటిమయమై పోయాయి.
చాల రోజుల తరువాత వాతావరణం చల్లబడటంతో ప్రజలందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.