సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh babu ) మొదటి సినిమాతోనే ఒక మంచి హీరోగా గుర్తింపు పొందాడు.ఇక తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.
అంతటి స్టార్ హీరో అయిన కూడా మహేష్ బాబు ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి కామెంట్స్ చేయడు.
తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు.ఇక ఈ క్రమంలో మహేష్ బాబు నమ్రత( Namrata ) ఏం చెప్తే అది చేస్తాడు అనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.నమ్రత ఏ సినిమా చేయమంటే ఆ సినిమాకి సైన్ చేస్తాడు అంతే తప్ప తన సొంతగా డెసిజన్స్ ఏం తీసుకోడు అని కొంతమంది మహేష్ బాబు మీద కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి సందీప్ రెడ్డి( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో బాలీవుడ్ లో వస్తున్న ఎనిమల్ సినిమా ( Animal )స్టోరీని ముందుగా సందీప్ మహేష్ బాబుకి( Mahesh babu ) చెప్పాడంట ఆ సినిమా స్టోరీ మహేష్ కి నచ్చింది కానీ నమ్రత కి ఆ స్టోరీ పెద్దగా నచ్చకపోవడంతో ఆ స్టోరీ వద్దని చెప్పి మీరు ఏదైనా ఇంకా వేరే స్టోరీ ఉంటే తీసుకురండి మనం వేరే సినిమా చేద్దామని నమ్రత సందీప్ తో చెప్పిందంట.
దాంతో సందీప్ ( Sandeep Reddy Vanga )ఆ స్టోరీని తీసుకెళ్లి బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణభీర్ కపూర్ ( Ranbir kapoor )కు చెప్పి ఆయన్ని ఒప్పించి ఎనిమల్ అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా ఆ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.అది చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది ఇది ఒక డిఫరెంట్ సినిమా అని, సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతో అయితే ఎలాంటి మ్యాజిక్ చేశాడో, ప్రస్తుతం ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తుంది…
.