కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానుండగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను ఆహ్వానిస్తామని తెలిపారు.
రాష్ట్రపతి నిలయంలోనూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ క్రమంలోనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న ఆయన విమోచన దినోత్సవంపై ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారన్నారు.
ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ హాజరవుతారని కిషన్ రెడ్డి విమర్శించారు.విమోచన దినోత్సవంలో మొదటి ద్రోహి కాంగ్రెస్, రెండో ద్రోహి బీఆర్ఎస్ అని మండిపడ్డారు.