బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”( Jawan ).ఈ సినిమాపై బాలీవుడ్ లో ఎంత బజ్ క్రియేట్ అయ్యిందో సౌత్ లో కూడా అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది.
రేపు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.దీంతో టీమ్ అంతా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టారు.
ఈ సినిమా పేరుకు మాత్రమే బాలీవుడ్.ఈ సినిమాలో పని చేసిన వారంతా సౌత్ కు చెందిన వారు కావడం విశేషం.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార( Nayanthara ) హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్” సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.పఠాన్ సినిమాతో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి సంచలనాలు సృష్టించిన షారుఖ్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో వసూళ్లు సాధించాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే విధంగానే ఉంది.మొదటి షో పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
‘ఇట్స్ టైం ఫర్ జవాన్.పవర్ఫుల్ షారుఖ్ ను చూసేందుకు ఎగ్జైట్ గా ఉందంటూ’ మహేష్( Mahesh ) తెలిపారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాదించాలి అని విష్ చేసారు.తాను కూడా తన కుటుంబంతో కలిసి జవాన్ సినిమాను చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు.ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మరి సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.