బాపట్ల జిల్లాలో హత్యకు గురైన బాలుడు అమర్నాథ్( Amarnath ) కుటుంబాన్ని చంద్రబాబు( Chandrababu ) పరామర్శించడం జరిగింది.సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించటంతో.
వారి చేతుల్లో దారుణ హత్యకు గురైన అమర్నాథ్.పదవ తరగతి చదువుతున్నాడు.
ఈ ఘటన రేపల్లె నియోజకవర్గం ఉప్పల వారి పాలెంలో జరిగింది.దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బాలుడు అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది.చంద్రబాబు రాకతో అమర్నాథ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఇదే సమయంలో అమర్నాథ్ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.చంద్రబాబు రాకతో ఉప్పల వారి పాలెంలో.అమర్నాథ్ ఇంటి వద్ద ప్రజలు భారీ ఎత్తున రావడం జరిగింది.అన్ని విధాలా అండగా ఉంటామని భయపడాల్సిన అవసరం లేదని.అమర్నాథ్ కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు.అక్కను వేధిస్తున్నారని బాలుడు అమర్నాథ్ ఆకతాయిలను ఎదిరించడంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.
ట్యూషన్ కు వెళ్తున్న బాలుడిని నలుగురు వెళ్లి దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు.ఈ ఘటన ఈ నెల 16న జరిగింది.
ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.పదో తరగతి చదువుతున్న బాలుడిపై పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసిన ఈ ఘటన రాష్ట్రంలో అందరినీ కలిచివేసింది.
ఈ క్రమంలో సోమవారం బాధిత కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసి.పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు.