ఓ మహిళకు వివాహం అయ్యి ఆరుగురు పిల్లలు సంతానం.భర్త డబ్బు సంపాదన కోసం దుబాయ్ ( Dubai ) వెళ్లడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం( Illegal Relationship ) పెట్టుకుంది.
భర్త దుబాయ్ నుండి తిరిగి వచ్చాక భార్య అక్రమ సంబంధం గురించి బయటపడింది.దీంతో ఆ భార్య ప్రియుడుతో కలిసి దారుణానికి పాల్పడింది.
వివరాల్లోకెళితే.బీహార్ లోని( Bihar ) గోపాల్ గంజ్ జిల్లా లాడ్పూర్ గ్రామంలో చేపల విక్రత మహమ్మద్ మియా గత కొంతకాలం డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ కు వెళ్ళాడు.
అప్పుడు మహమ్మద్ భార్య నూర్జహాన్ ఖాతూన్ కు నౌషద్ ఆలం అనే వ్యక్తికు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన మహమ్మద్ కు ఈ విషయం తెలియడంతో తరచూ నూర్జహాన్ ను ఇష్టం వచ్చినట్లు కొడుతూ వేధించేవాడు.
నూర్జహాన్ భర్త వేధింపులు భరించలేక తన ప్రియుడు నౌషాద్ తో కలిసి ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా హత్య చేసిన నిందితులు మన్సూర్ ఆలం, పర్వేజ్ ఆలం లు పట్టుబడ్డారు.పోలీసులు ఈ నిందితులను తమదైన శైలిలో విచారించగా హతుడి భార్య నూర్జహాన్ రూ.50 ఇచ్చి మహమ్మద్ మియా ను తమతో హత్య చేయించిందని తెలిపారు.ఆమె ఇచ్చిన డబ్బులో రూ.28 వేల రూపాయలతో
తుపాకీ, 4 బుల్లెట్లు కొనుగోలు చేశామని పోలీసులకు తెలిపారు.పోలీసులు నూర్జహాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తరచూ తనను వేధించేవాడని, అందుకే హత్య చేయించానని తెలిపింది.అంతేకాకుండా తన ఆరుగురు పిల్లలతో కలిసి ప్రియుడు నౌషాద్ ఆలంతో కలిసి ఉంటానని తెలిపింది.ప్రస్తుతం పోలీసులు సుపారి కిల్లర్స్ తో పాటు నూర్జహాన్ ఆమె ప్రియుడు నౌషాద్ ఆలం ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.