సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram )దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.ఈ సినిమా ఈ మధ్యనే సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసుకుంది.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చారు.దీంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
అతి త్వరలోనే మహేష్( Mahesh Babu ) వెకేషన్ ముగించే అవకాశం కనిపిస్తుంది.ఎందుకంటే జూన్ 7 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు అని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ లోపులోనే మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ తెలిపాడు.సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున అంటే మే 31న ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.మాస్ ట్రీట్ ఉంటుంది అని ఎదురు చూస్తుండగా ఈ టీజర్ వీడియో పనులు పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది.గ్లింప్స్ వీడియో అయితే కట్ చేయడం పూర్తి అయ్యింది అట.కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫైనలైజ్ కావాల్సి ఉందట.అందుకే ఈ వీడియో తాలూకా బ్యాలెన్స్ ఇంకా ఉందని చెప్పాలి.
అయితే ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో ఇది తప్పకుండ పూర్తి చేసి ఆన్ టైం లో వీడియోను రిలీజ్ చేస్తారని మాత్రం చెబుతున్నారు.చూడాలి ఇంత వైయిటింగ్ చేస్తున్న మాస్ ట్రీట్ ఎలా ఉంటుందో.కాగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ( Radhakrishna )భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.