ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్( Nandi Awards ) రచ్చ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.ఈ వివాదం రోజు రోజుకి ఇంకా ముదురుతూనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఈ అవార్డ్స్ ని సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతో గౌరవంగా భావిస్తారు.అటువంటిది నంది అవార్డుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2016లో నుంచి ఇవ్వడం ఆపేశాయి.
ఇక ఈ పురస్కారం గురించి పలువురు సినీ ప్రముఖులు అనేక సందర్భాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను అడుగుతూ వస్తున్నారు.అయితే అటు నుంచి ఎటువంటి రియాక్షన్ కనిపించకపోవడంతో ప్రభుత్వాలను విమర్శించేలా పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాతలు సి కళ్యాణ్, అశ్విని దత్త్, జి ఆదిశేషగిరిరావు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో స్టార్ నిర్మాత బన్నీ వాసు( Producer Bunny Vasu ) కూడా సంచలన వాఖ్యలు చేశాడు.ఇటీవల ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో మనం ఆస్కార్ ( Oscar ) అందుకున్నాము.ఆ అవార్డు రావడం ఎంతో గర్వం కారణం.ఆస్కార్ అనేది ఎంతటి గొప్ప పురస్కారమో నంది అవార్డు కూడా అంటే పెద్ద పురస్కారం.అలాంటి అవార్డుని కొన్ని సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలు ఇవ్వడం పూర్తిగా మానేశాయి.
దాదాపుగా 7 ఏళ్లుగా ఈ అవార్డ్స్ ని ఇవ్వడం మానేశారు.
నంది అవార్డు అన్నది తెలుగు పరిశ్రమ చేసుకునే పెద్ద పండగ.కాబట్టి దయచేసి సినీ పెద్దలు కాస్త చొరవ తీసుకోని ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ప్రకటించేలా చేయాలనీ కోరుకుంటున్నాను అని తెలిపారు బన్నీ వాసు.కాగా మొన్నటికి మొన్న ఈ నంది అవార్డ్స్ గురించి అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు.ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు.
ప్రస్తుతం వాళ్ళకి ఇస్తారు.సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది అని తెలిపింది అంటూ అశ్విని దత్ చేసిన వాఖ్యలపై ఏపీ ప్రభుత్వం మండి పడింది.