జనసేనాని బాటలో అడుగులు వేస్తూ...

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో వివిధ వర్గాల ప్రతినిధులు సమావేశం ఒకరు హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగి… మరొకరు విజయవాడలో వడ్రంగి పనులు చేసుకొనే యువకుడు… ఇంకొకరు ఉత్తరాంధ్రలో చిన్నపాటి కాంట్రాక్టులు చేసే వ్యాపారి… – ఇలా భిన్న వర్గాలవారిని ఒక చోటుకు చేర్చింది జనసేన పార్టీ భావజాలం.జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలను అనుసరించే వీరు ఉగాది పర్వదినం నేపథ్యంలో తమ అభిమాన నాయకుణ్ణి మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు.

 People From Different Categories Met Janasena Pawan Kalyan, Janasena ,pawan Kal-TeluguStop.com

భిన్న నేపథ్యాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరితోపాటు పార్టీ నాయకులు  శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు.

విజయవాడ, వెంకటగిరి, కల్వకుర్తి, గంగాధర నెల్లూరు ప్రాంతాలకు చెందిన చేతి వృత్తులవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు  శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వడ్రంగి శ్రీ కూర్మారావు రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ జనసేన పార్టీకి తన వంతుగా విరాళం అందజేశారు.ఆయనకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు.

శ్రీ కూర్మారావును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

వివిధ చేతి వృత్తుల్లో ఉన్నవారు తమ వృత్తి జీవితంలోని సాదకబాధకాలను తెలిపారు.

యువత తమ ఆలోచనలను, తమ ప్రాంత సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు.అనంతరం పార్టీకి తమ మద్దతుగా విరాళాలు అందజేశారు.

తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు తమ వంతు విరాళాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికి శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

నూతన సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube