సూర్యాపేట జిల్లా: కోదాడ పురపాలక సంఘం పరిధి అంబేడ్కర్ నగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను గుర్తించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు తనిఖీలు నిర్వహించారు.