టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ తో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కలసి పనిచేయడానికి ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా.
తెలంగాణ చుట్టుప్రక్కల రాష్ట్రాలలో పర్యటిస్తూ ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల పదవ తారీకు చెన్నైలో పర్యటించడానికి రెడీ అయ్యారు.
విషయంలోకి వెళ్తే ఓ ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో “2024 ఎన్నికలు-ఎవరు విజయం సాధిస్తారు?” అనే అంశానికి సంబంధించి చర్చా వేదికలో పాల్గొననున్నారు.
ఈ చర్చ వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కీలక పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ఈ వేదికపై బీఆర్ఎస్ జాతీయా ఏజెండా అదేవిధంగా దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ యొక్క ఆలోచనలు పంచుకోనున్నారట.తెలంగాణ రాష్ట్రంలో విజయవంతమైన వివిధ పథకాల గురించి కూడా వివరించనున్నారట.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పాటు.తెలంగాణలో.
జరుగుతున్న అభివృద్ధి ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకీ సంబంధించి కొన్ని విషయాలు కవితా వివరించనున్నారట.