వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఇటీవల అమెరికా పర్యటన తర్వాత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావటం తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్ పై షర్మిల కామెంట్లు చేయడం జరిగింది.
తెలంగాణ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లు ఉందని ఎద్దేవా చేశారు.హరీష్ రావు కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్ లోకి వెళ్ళారని అందులో కేసీఆర్ పాతసార పోసారని.
బడ్జెట్ లో కొత్తగా ఏమీ లేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మొదటినుండి తెలంగాణకు వైయస్ కుటుంబం వ్యతిరేకమని సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ జైలుకు వెళ్లిన సమయంలో విజయలక్ష్మి. షర్మిల పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.కానీ ఆ తర్వాత జగన్ రాజకీయంగా షర్మిల…విజయలక్ష్మిని అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు.అంతేకాదు షర్మిల ఆంధ్రకి వెళ్లి ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు.రేపు మాపో జగన్ జైలుకు వెళితే మళ్ళీ ఆమెకు అవకాశం వస్తుందని పేర్కొన్నారు.
అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయం వృధా చేసుకోవద్దని షర్మిలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.