సాధారణంగా స్టార్ హీరోల సినిమాల గురించి లోకల్ మీడియా లో పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోరు.కానీ జాతీయ స్థాయి మీడియా లో కూడా పుకార్లు వస్తే కచ్చితంగా స్పందించాల్సిందే.
ప్రముఖ మీడియా సంస్థలు మరియు జాతీయ మీడియా సంస్థలు ఏదైనా ఒక సినిమా గురించి ప్రచారం చేస్తే జనాల్లోకి ఎక్కువగా వెళుతుంది.అది తప్పుడు వార్త అయితే వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు స్పందించాల్సి ఉంది.
కానీ ప్రాజెక్టు కే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం జాతీయ మీడియా లో వచ్చిన పుకార్ల ను కూడా లైట్ తీసుకుంటున్నారు.ఇటీవల ప్రాజెక్ట్ కే చిత్రం 2 భాగాలుగా విడుదల కాబోతుంది అంటూ జాతీయ మీడియా లో ప్రధానంగా వార్తలు వచ్చాయి.
అసలు విషయం ఏంటంటే ఆ సినిమా ఓకే భాగంగా విడుదల కాబోతుంది, అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు జాతీయ మీడియా లో వచ్చిన వార్తలపై స్పందించలేదు.
ప్రాజెక్ట్ కే గురించి వచ్చిన పుకార్ల ను పట్టించుకోకుండా వారి పనిలో వారు బిజీగా ఉన్నారు.దాంతో ప్రభాస్ అభిమానులు నిజంగానే ప్రాజెక్టు కే చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే మరియు దిశా పటాని కనిపించబోతున్నారు.
టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా కు సంగీతం శ్రీనివాసరావు మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.మహానటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు.వైజయంతి మూవీస్ వారు ఈ సినిమా ను దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా విడుదల తేదీ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.