ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గన్నవరం విమానాశ్రయంలో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు బయలుదేరడం తెలిసిందే.ఈ క్రమంలో గాల్లోకి లేచిన కాసేపటికే అత్యవసరంగా కిందకు దిగటం జరిగింది.
సాంకేతిక లోపంతో అత్యవసరంగా తిరిగి రావటం జరిగింది.దీంతో గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా సీఎం జగన్ తన నివాసానికి వెళ్లిపోయారు.
ఇక ఇదే సమయంలో సమస్యలు చక్కదిద్దడానికి విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే సీఎం జగన్ ఎమర్జెన్సీ లాండింగ్ పై అధికారులు కీలక ప్రకటన చేశారు.గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి స్పందించారు.“సాంకేతిక కారణాలతో సీఎం విమానం వెనక్కి వచ్చింది.AC వాల్వ్ లో లీకేజీతో ప్రెజర్ తగ్గింది.ప్రతి విమానం బయలుదేరే సమయంలో పూర్తిగా పరిశీలించటం జరుగుతుంది.ఆ తరువాతే టేక్ ఆఫ్ అవుతుంది.చిన్న సమస్య ఉన్న వెంటనే ఫ్లైట్ వెనక్కి తీసుకొస్తారు.
టెక్నికల్ లోపం అనేది ఏ టైంలో నైనా, ఏ విమానంలోనైనా రావచ్చు అని వెల్లడించారు.