టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్.. కన్ఫర్మ్ చేసిన పాండ్య!

న్యూజిలాండ్‌, టీమ్ ఇండియా మధ్య శుక్రవారం నుంచి రాంచీలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య శుభ్‌మన్ గిల్ విషయంలో కీలక డెసిషన్ వెల్లడించాడు.పృథ్వీ షా కంటే శుభ్‌మన్ గిల్ బాగా రాణిస్తున్నాడని, రాంచీలో న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ మొదలు పెట్టేది అతడేనని క్లారిటీ ఇచ్చాడు.23 ఏళ్ల వయస్సులో ఉన్న గిల్ చాలా కాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.అతను తన చివరి నాలుగు ODI మ్యాచ్‌లలో మూడు సెంచరీలు సాధించాడు.హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు.

 Pandya Confirmed Shubman Gill As Opener In T20 Series!, India Vs New Zealand, Pr-TeluguStop.com

Telugu Hardik Pandya, India Zealand, Indian Cricket, Prithvi Shaw, Shubman Gill-

భారత క్రికెట్ జట్టులోని యువ ఆటగాడు పృథ్వీ షా జులై 2021 నుంచి జాతీయ జట్టు తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడలేదు.అయితే వీటికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి అతడిని కీలకమైన న్యూజిలాండ్‌తో జరిగే T20 సిరీస్‌లో తీసుకోవడం లేదు.అతను దేశీయ ఆటలలో బాగా రాణించినా, ప్రస్తుతం అతన్ని టీమ్‌లో భాగం చేసుకోవడం కష్టం.ఒకవేళ భారత్‌ ముందుగానే సిరీస్‌ను గెలిస్తే, మరికొందరు స్టార్ ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటే ఆడే అవకాశం పృథ్వీకి లభిస్తుంది.

Telugu Hardik Pandya, India Zealand, Indian Cricket, Prithvi Shaw, Shubman Gill-

ఇకపోతే కెప్టెన్ హార్దిక్ పాండ్య మీడియాతో మాట్లాడుతూ, కొత్త బంతితో బౌలింగ్ చేయడం తనకు ఇష్టమని, అతను ప్రస్తుతం బాగా సిద్ధమవుతున్నందున ఒత్తిడికి గురికావడం లేదని చెప్పాడు.టీ20 సిరీస్ జనవరి 27న ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube