ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో మన ఆర్ ఆర్ ఆర్ యొక్క నాటు నాటు కు చోటు దక్కించుకోవడం తో దేశ వ్యాప్తం గా సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి యొక్క ఆనందానికి అవధులు లేవు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు మొత్తం యూనిట్ సభ్యులంతా కూడా ఈ సమయం లో ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇప్పటికే అమెరికా లో ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయడం జరిగింది.
అలాగే ఓటీపీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అయింది.ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అవడం తో సినిమా కు మరింతగా పాపులారిటీ లభించడం జరిగింది, అందుకే అమెరికా లో మళ్ళీ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సాధారణం గా ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా లను అమెరికా లో మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది.అలాగే ఈ సినిమా ను కూడా విడుదల చేస్తే కచ్చితం గా మిలియన్ నుండి రెండు మిలియన్ల డాలర్ల వసూలను నమోదు చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి ఇప్పటికే ఆ ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.ఆస్కార్ నామినేషన్స్ లో సినిమా ను ఉంచడం కోసం రాజమౌళి దాదాపుగా 50 కోట్ల రూపాయలను పబ్లిసిటీ కోసం ఖర్చు చేశాడట.
ఇప్పుడు రీ రిలీజ్ చేయడం ద్వారా ఆ మొత్తంను రాబట్టే ప్రయత్నాలను జక్కన్న చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఒక వైపు సినిమా విడుదల వల్ల కలెక్షన్స్ రావడం తో పాటు మరో వైపు సినిమాకు పబ్లిసిటీ మరింత దక్కినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాజమౌళి సినిమా కు ఆస్కార్ నామినేషన్ దక్కడం దేశం గర్వించ దగ్గ విషయం అంటూ సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.