యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లింది ఓ కన్నతల్లి.
పిల్లల చేతులకు తాళ్లు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి యాదాద్రిలో తల్లి, ఆమె ప్రియుడు వదిలేసి వెళ్లారని తెలుస్తోంది.
చిన్నారులను గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
విచారణ చేపట్టిన పోలీసులు బంధువులకు సమాచారం ఇవ్వగా చిన్నారులను తీసుకు వెళ్లేందుకు నిరాకరించారని సమాచారం.దీంతో ముగ్గురు పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి పోలీసులు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి తల్లి, ఆమె ప్రియుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.