తెలంగాణ రాష్ట్ర సమితి రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు.
దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాగా బయలుదేరారని విమర్శించారు.దేశంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు.
ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలెక్కడ అని నిలదీశారు.గుజరాత్ లో ఇటీవల కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు.
తెలంగాణను మోసం చేశారన్న ఆయన ఇక దేశాన్ని కూడా మోసం చేస్తారా అని అడిగారు.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా నిలువ నీడలేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.