2023 సంక్రాంతి థియేటర్ల సమస్య పైకి చిన్న సమస్యగా కనిపించినా రోజులు గడిచే కొద్దీ ఈ సమస్య పెద్ద సమస్య అవుతోంది.మెగా, నందమూరి హీరోల సినిమాలకు తక్కువ సంఖ్యలో థియేటర్లు లభ్యమవుతూ ఉండటం ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది.
దిల్ రాజు తలచుకుంటే వారసుడును తెలుగులో ఆలస్యంగా రిలీజ్ చేయవచ్చు.కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమాను సంక్రాంతి సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమిళనాట ప్రచారం జరుగుతోంది.అయితే చిరంజీవి, బాలయ్య అభిమానులు మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఒకటి రెండు స్క్రీన్స్ ఉన్నచోట చిరంజీవి, బాలయ్య సినిమాలకు థియేటర్లు కేటాయించే విధంగా ఫ్యాన్స్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.వారసుడు మూవీకి థియేటర్లను కేటాయించడం ఇష్టం లేదని థియేటర్ల ఓనర్లు సైతం చెబుతున్నారు.
పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే చిరంజీవి, బాలయ్య కూడా ఇందుకు సంబంధించి జోక్యం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.ప్రస్తుతం ఫ్యాన్స్ సమావేశాలు, డిస్కషన్లు జరుగుతున్నాయని బోగట్టా.
దిల్ రాజు తమ హీరోలను ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదని మెగా, నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఫ్యాన్స్ జోక్యం చేసుకుంటే థియేటర్ల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు థియేటర్ల సమస్య గురించి స్పందించాల్సి ఉంది.ప్రైమ్ థియేటర్లను వారసుడు సినిమాకు కేటాయించడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు నష్టపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.థియేటర్ల సమస్యను నిర్మాతలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.సంక్రాంతి సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ల సమస్య వల్ల నిర్మాతలు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.
నిర్మాతలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటే మంచిది.