కొన్ని సినిమాలు కథ, కథనం అద్భుతంగా ఉన్నా సరైన నటుల ఎంపిక లేకపోవడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయి.సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమా థియేటర్లలో ఫ్లాప్ కాగా ఓటీటీలో హిట్ గా నిలిచింది.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా గురించి తాజాగా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.గాడ్సే సినిమాను పవన్ లేదా ఎన్టీఆర్ చేసి ఉంటే ఈ సినిమా చరిత్ర సృష్టించేదని ఆయన అభిప్రాయపడ్డారు.
గాడ్సే సినిమాను మంచి సినిమా నిర్మించాలనే ఆలోచనతో తీశామని గాడ్సే మూవీ కూడా బాగుంటుందని ఆయన అన్నారు.
అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసిన రేంజ్ లో థియేటర్ లో ఈ సినిమాను ఆదరించలేదని ఆయన కామెంట్లు చేశారు.గాడ్సే మూవీ సబ్జెక్ట్ ను మోసే రేంజ్ ఉన్న్ ఆర్టిస్ట్ పడలేదని సి.
కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.డైరెక్టర్ కు కూడా ఆ విషయం ముందే చెప్పానని ఆ సబ్జెక్ట్ ను మోసే టాలీవుడ్ స్టార్స్ ఇద్దరే ఇద్దరని సి.కళ్యాణ్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లలో ఎవరు నటించినా ఆ సినిమా చరిత్ర సృష్టించేదని సి.
కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
పిల్లలను మంచి చదువులు చదివించి పిల్లలకు సరైన ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న తల్లీదండ్రులకు గాడ్సే సినిమా రీచ్ అవుతుందని అనుకున్నా ఆ సినిమా రీచ్ కాలేదని సి.కళ్యాణ్ వెల్లడించారు.గాడ్సే మూవీకి ఖర్చు విషయంలో వెనుకాడలేదని ఆయన అన్నారు.
సత్యదేవ్ సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో సినిమాను తీశామని ఆయన కామెంట్లు చేశారు.సినిమాలో డబ్బు పోతే పోయిందని నేను ఎప్పుడూ భావించనని సి.కళ్యాణ్ తెలిపారు.సినిమా ఇచ్చిన డబ్బును సినిమానే తీసుకెళుతుందని నేను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.