ఈ ఏడాదిలో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో డీజే టిల్లు కూడా ఉంది.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.
ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టరనే చెప్పాలి.
మరి అలాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ విమల్ కృష్ణ.
ఈయన ఈ సినిమాను యూత్ కు చేరువయ్యేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.సినిమాకు సీక్వెల్ కూడా ఉంది అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.ఈసారి సీక్వెల్ ను కొత్త దర్శకుడు తెరకెక్కించ బోతున్నట్టు సమాచారం.
మరి అలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నేహా శర్మ నటించింది.
అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఈమె కాకుండా మరో హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు.
కానీ ఈ ఎంపిక విషయంలోనే గందర గోళం నెలకొంది.రోజుకొక హీరోయిన్ పేరు తెరమీదకు వస్తుంది.
ముందుగా శ్రీలీలను ఈ పాత్రలో నటిస్తుంది అని అనుకోగా మళ్ళీ ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపించింది.ఈమె బయటకు రాగా ఫైనల్ గా మడోనా సెబాస్టియన్ పేరు కూడా వినిపించింది.
ఇక ఇప్పుడు ఇవన్నీ పోయి యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపిస్తుంది.
రీసెంట్ గా మీనాక్షి చౌదరి హిట్ 2 సినిమాతో మంచి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం ఈమె పేరు వినిపిస్తుంది.సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా ఈమె కన్ఫర్మ్ అయ్యిందని.
అందుకు సంబందించిన అన్ని చర్చలు పూర్తి అయ్యాయని వార్తలు వస్తున్నాయి.మరి వీరిలో ఎవరు రాధిక పాత్రలో నటిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు