YCP MP pillisubhash Chandraboss: హర్షకుమార్ తో భేటీ అయిన వైసీపీ ఎంపీ..!!

గోదావరి జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు.చాలావరకు రాష్ట్ర రాజకీయాలను గోదావరి జిల్లాలే  ప్రభావితం చేస్తాయి.

 Ycp Mp Pillisubhash Chandraboss Met Harsha Kumar Ycp Mp Pillisubhash Chandraboss-TeluguStop.com

ఈ జిల్లాలలో మెజార్టీ స్థానాలు గెలిచిన పార్టీలు అధికారంలో ఉంటాయి.ఈ క్రమంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కావడం గోదావరి జిల్లా రాజకీయాలలో సంచలనంగా మారింది.

ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పదవిని హర్ష కుమార్ తిరస్కరించారు.ఈ క్రమంలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్…హర్షకుమార్ తో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

దీంతో వైసీపీలో హర్షకుమార్ జాయిన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరోపక్క సన్నిహితుల సమస్య విషయమై హర్షకుమార్ నీ కలిసినట్లు బోస్ తెలియజేస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్రలో హర్ష కుమార్ పాల్గొనడం జరిగింది.అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పదవి.

ఇచ్చిన గాని దానిని తిరస్కరించడం జరిగింది.కాగా ఇప్పుడు వైసీపీ ఎంపీతో హర్షకుమార్ భేటీ జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సైతం చర్చనీయంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube