ఈరోజు ఉదయం ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే.ప్రధాని మోడీ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో భారత్ లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి జీ20 దేశాలు రానున్నాయి.ఈ నేపథ్యంలో జీ20 అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ప్రధాని మోడీ ఈరోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంకా పలు పార్టీ అధినేతలను ఆహ్వానించడం జరిగింది.
కాగా ఈరోజు సాయంత్రం మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్.టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే తదితరులు హాజరయ్యారు.వచ్చే ఏడాది జరగబోయే జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఇతర దేశాలకు భారత్ అందించాల్సిన సందేశం మరియు చర్చించాల్సిన విషయాలపై… ప్రధాని మోడీ వచ్చిన సిఎంలు ఇతర పార్టీల నేతల వద్ద నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.