ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఈయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.
ఈ సినిమా కంటే ముందు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన డార్లింగ్ క్రేజ్ ఈ సినిమా తర్వాత మాత్రం ప్రపంచ నలుమూలలా విస్తరించింది.
అందులో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
వీటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా షూట్ జరుపు కుంటున్నాయి.
వీటితో పాటు ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు.మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే సైలెంట్ గా షూట్ పూర్తి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
అంటే ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్.ఇదే నిజమైతే ఈ సినిమా అదిరిపోవడం ఖాయం.మొత్తానికి మారుతి ప్రభాస్ కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేసాడు.
ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.