బుల్లితెర జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కు జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు దక్కింది.గాలోడు సెకండ్ హీరోయిన్ ఆద్యా శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టోరీని రన్ చేసే పాత్రల్లో నటించాలని నేను భావిస్తున్నానని ఆమె తెలిపారు.
గాలోడు డైరెక్టర్ సెట్స్ లో చాలా కామ్ గా ఉండేవారని ఆమె అన్నారు.డైరెక్టర్ ఎక్కువగా అరిచేవారు కాదని ఆద్యా శర్మ చెప్పుకొచ్చారు.
గాలోడు మూవీలో లెంగ్తీ డైలాగ్స్ మాత్రమే ఇబ్బందిగా అనిపించాయని ఆమె అన్నారు.మరో హీరోయిన్ ఎక్కువ టేక్స్ తీసుకున్నారని లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఆమె ఎక్కువ టేక్స్ తీసుకున్నారని ఆద్యా శర్మ తెలిపారు.
నాకు చెప్పింది చెప్పినట్టు చేస్తే సంతోషం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.స్కూల్ లో చెప్పిన విధంగా కెమెరామేన్ అన్నీ క్లియర్ గా చెప్పేవారని ఆద్యా శర్మ వెల్లడించారు.
డైరెక్టర్ గారి నుంచి ఓపిక నేర్చుకున్నాని ఆద్వా శర్మ తెలిపారు.
పది టేక్స్ తీసుకున్నా ఓపికగా ఉంటానని కొన్ని విషయాలలో ఓపిక ఉంటుందని ఈ హీరోయిన్ వెల్లడించారు.ఎవరైనా వస్తానని చెప్పి రాకపోతే నాకు కోపం వస్తుందని కోపం వస్తే బూతులు తిడతానని అయితే ఆ బూతులు మంచు బూతులు అని ఆమె పేర్కొన్నారు.ఇలా చేయడం కరెక్టా అని అడుగుతానని ఆద్యా శర్మ తెలిపారు.
ఒంటరిగా ఉండటమే నాకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు.హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ఇష్టమని ఆద్యా శర్మ చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో ఉంటే ప్రతి అనుభవం గురించి తెలుస్తుందని ఆమె అన్నారు.ఈ హీరోయిన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆద్యా శర్మ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.