శ్రీసత్యసాయి జిల్లా మారాలలో కొండ చిలువ హల్ చల్ చేసింది.మామిడి తోటలో భారీ కొండచిలువ సంచరిస్తుండగా రైతులు గుర్తించారు.
సుమారు 15 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కొండ చిలువను పట్టుకున్నారు.
అనంతరం దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో వదిలి పెట్టారు.దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.