పెళ్లి వేడుక అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది.అలాగే ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక.
అందువల్ల పెళ్లిరోజుకు ముందే వధూవరులు తమ పనులకు సెలవులు పెట్టేసి పెళ్లి పనుల్లో నిమగ్నమవుతారు.ఇది ఎక్కడైనా జరిగేదే కానీ తాజాగా ఒక వ్యక్తి మాత్రం పెళ్లి మండపంలో కూర్చుని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని డ్యూటీ చేశాడు.
ఆన్లైన్ వర్క్ చేస్తున్న అతడిని చూసి అందరూ ఇదేం చోద్యం అంటూ నోరెళ్ళ బెడుతున్నారు.అలాగే ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
కరోనా తర్వాత నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కంపెనీలు అవలంబిస్తున్న వేళ ఉద్యోగులకు కొంచెం కూడా రెస్ట్ దొరకడం లేదు.సెలవు తీసుకుంటే ఎక్కడ జాబ్ పోతుందేమోననే భయం కూడా ఉద్యోగుల్లో ఉంది.
అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓ వరుడి పెళ్లి వేదికపై కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకున్నాడు.దీనికి సంబంధించిన ఫొటోను శ్రీమోయీ దాస్ అనే యూజర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
ఈ ఫొటో కాస్త వైరల్గా మారింది.దీనిలో ఒక మండపంలో పెళ్లికొడుకు ల్యాప్టాప్లో పనిచేస్తూ కనిపించాడు.
ఈ ఫొటో చూసి వరుడిపై సానుభూతి చూపుతున్నారు నెటిజన్లు.ఈ వరుడిని చూస్తే.చాలా జాలి వేస్తోందని. పాపం పెళ్లి రోజు కూడా ఇతడికి సెలవు దొరకలేదని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇలాంటి ఉద్యోగాల వల్ల ప్రజలు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.