టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.కచ్చితంగా టీడీపీ గెలిచే రీతిలో… తనదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నారు.
ఒకపక్క ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడుతున్నే మరోపక్క జిల్లాల సమావేశాలతో పార్టీ క్యాడర్ తో చంద్రబాబు భేటీ అవుతూ ఉన్నారు.ఇదంతా పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా “బాదుడే బాదుడు”, “ఇదేం కర్మ” పేరిట ఆందోళనలు , నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా నేడు ఏలూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలలో చంద్రబాబు పర్యటించడానికి రెడీ అయ్యారు.ఈరోజు ఏలూరు జిల్లా కలపారు పెద్దవేగి మండలంలో పర్యటించనున్నారు.ఆ తర్వాత విజయరాయిలో.జరిగే “ఇదేం కర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో పాల్గొంటారు.
అక్కడే జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఆ తర్వాత సాయంత్రం చింతలపూడిలో జరిగే రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు.
అనంతరం రాత్రికి జంగారెడ్డిగూడెంలో బస చేస్తారు. ఈ క్రమంలో చంద్రబాబును స్వాగతించడానికి జిల్లా నాయకులూ.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది.