దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో తొలి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
దాదాపు మూడు వేల పేజీలతో ఛార్జ్ షీట్ ను రూపొందించారు అధికారులు.సాప్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా ఛార్జ్ షీట్ కాపీలు కోర్టుకు సమర్పించారు.
ఇందులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా ఉన్నాయని ఈడీ తెలిపారు.ఈ స్కాం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు విజయ్ నాయర్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.ఇవాళ్టితో ఈడీ కస్టడీ ముగియడంతో విజయ్ నాయర్ ను న్యాయస్థానంలో హాజరుపరిచారు.