టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రేష్ట మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం.ఈ సినిమాలో మొదటిసారిగా కలెక్టర్ పాత్రలో నటించి సందడి చేశారు.
ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి నటించి సందడి చేశారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 900 కు పైగా థియేటర్లలో ఎంతో ఘనంగా విడుదలైంది.
ఈ సినిమా విడుదలైన అనంతరం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఓటీటీలో ప్రసారమయ్యే సందడి చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులైనప్పటికీ ఇంకాఓటీటీలో ప్రసారం కాలేదు.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని జీ 5 అధికారికంగా తెలియజేశారు.ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ జీ 5 లో ప్రసారం కానుందని అధికారికంగా వెల్లడించారు.థియేటర్ లో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది అయితే ఇక్కడ ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.ఎప్పుడు ప్రేమ కథ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టే కలెక్టర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.