సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందం అభినయంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ గురించి అందరికి సుపరిచితమే.ఈమె ప్రముఖ నిర్మాత సురేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఇక ఈమె తల్లి మేనక కూడా హీరోయిన్ కావడం విశేషం.ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన కీర్తి సురేష్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈమె బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ తన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈమె బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే తనకు నిర్మాతలు తన రెమ్యూనరేషన్ ఒక కవర్లో పెట్టి తన చేతికి ఇచ్చేవారని తెలిపారు.అయితే నిర్మాతలు తనకు కవర్లో పెట్టి ఇవ్వడం వల్ల తన మొదటి సినిమా కోసం తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాననే విషయం సరిగా గుర్తు లేదని చెప్పుకొచ్చారు.
అయితే తనకు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ తీసుకెళ్లి తన తండ్రి చేతిలో పెట్టానని తెలిపారు.
ఇలా సినిమాలలో సంపాదించినది మొత్తం తన తండ్రికి ఇచ్చేదాన్ని ఇప్పటికీ కూడా తన సినిమాల ద్వారా సంపాదించినది తన తండ్రి చేతికే ఇస్తానంటూ ఈమె వెల్లడించారు.ఇలా తన రెమ్యూనరేషన్ గురించి కీర్తి సురేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఈమె మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.